Chandrababu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బ్యాడ్ టైం గురించి ఇప్పుడు రాష్ట్రంలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. తన రాజకీయ జీవితంలో అత్యంత సంచలన నిర్ణయం తాజాగా తీసుకోవడమే దీనికి కారణం. పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటన ప్రకంపనలే సృష్టించింది. అయితే, దీన్ని తెలుగు తమ్ముళ్లు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఔనండి. ఇదెక్కడో కాదు….చంద్రబాబుకు చిత్తూరు జిల్లా సొంత ఊరయిన నారావారిపల్లెలో తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు.
ఇది స్టోరీ…
ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవడం, ఈనెల 8 న ఎన్నికలు, 10 న ఫలితాలు రానుండటం తెలిసిన సంగతే. అయితే, దీనిని సవాల్ చేస్తూ వివిధ పార్టీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ జరగ్గా తీర్పు రిజర్వ్ లో ఉంచారు. మరోవైపు ఇదే సమయంలో ఎన్నికల బహిష్కరణ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అయితే, చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిషత్ ఎన్నికల్లో నారావారిపల్లెలోనే…టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధర్ పోటీ చేయడానికి సిద్దమయ్యారు. అంతేకాకుండా ప్రచారం చేస్తున్నారు.
అయ్యో ఎన్ని కష్టాలో..
మరోవైపు టీడీపీలో ఉన్న లుకలుకలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని టీడీపీ నేతలు చెప్తుండటంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. ఒకరిద్దరు నేతలు వ్యతిరేకించినా దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, కుప్పం సహా కొన్ని చోట్ల కొందరికి ఇది నచ్చకపోవచ్చని, అధినేత నిర్ణయాన్ని అందరూ పాటించాలని అన్నారు. మొత్తంగా పాపం చంద్రబాబు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు.