local Body Elections : ఏపిలో ఈ నెల 8వ తేదీన మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్, పదవ తేదీ ఓట్ల లెక్కింపు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7,8 తేదీలను సెలవు దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల ఏర్పాట్లకు 7న, పోలింగ్ కోసం 8న సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సంస్థలకు సెలవు ప్రకటిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. దుకాణాలు, వాణిజ్య సంస్థలకు కూడా సెలవు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ, సంస్థల వాహనాలను పరిషత్ ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ఆదేశాలు ఇచ్చారు. వాహనాలను జిల్లా కలెక్టర్ కు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
local Body Elections : చిటికెన వేలుకు ఓటు సీరా గుర్తు
పరిషత్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలుకు సీరా గుర్తు వేయాలని ఎస్ఈసీ నిర్ణయించింది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన వారికి ఎడమ చేతి చూపుడు వేలుకు సీరా గుర్తు వేసిన సంగతి తెలిసిందే. ఓటరు వేలుపై సిరా గుర్తు చెరిగి ఉండదన్న భావనతో ఈ ఎన్నికల పోలింగ్ నాడు ఎడమ చేతి చిటికెన వేలుకు సీరా గుర్తు వేయాలని నిర్ణయం తీసుకున్నది.