టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారం గతానికి భిన్నంగా ఉంది అని చాలా మంది సొంత పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. గతంలో తండ్రి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో మంత్రి పదవిలో ఉన్న లోకేష్ మాట్లాడే విషయంలో అనేక సార్లు తడబడి నవ్వులపాలు కావడం అందరికీ తెలిసిందే.
దీంతో లోకేష్ రాజకీయాలకు పనికిరాడు అని సొంత పార్టీలో ఉన్న నేతలు మీడియా ముందు విమర్శలు చేసే పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఎన్నికలలో ఓడిపోవటం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న లోకేష్.. తాజాగా పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడుల విషయంలో స్పందిస్తున్న తీరు టిడిపి సీనియర్లకు ఆశ్చర్యం కలిగిస్తుందని టాక్.
ఇటీవల వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు అదేవిధంగా తుఫాను వచ్చిన సమయంలో రైతులను పరామర్శించడం ఎక్కడ కష్టం ఉంటే అక్కడ వాలిపోవడం తో లోకేష్ ఖచ్చితంగా భవిష్యత్తు నాయకుడు అవుతారని పార్టీ క్యాడర్ అనుకుంటుందట. అంతేకాకుండా పార్టీ కార్యకర్త తో నేరుగా పలు పర్యటనలలో లోకేష్ ఇంట్రాక్ట్ కావటంతో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కడప ప్రొద్దుటూరు లో జరిగిన టీడీపీ కార్యకర్త హత్య విషయంలో అంతకుముందు అనంతపురం జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు విషయంలో లోకేష్ పర్యటనలు సీమలో పెద్ద హాట్ టాపిక్ అయిన టాక్.
ఇదివరకు లోకేష్ కాదు ప్రస్తుతం ఉన్న లోకేష్ అనే అభిప్రాయం సీమాంధ్ర నాయకుల్లో నెలకొందట. పైగా మాట్లాడే విషయంలో ఎక్కడా తడబడకుండా, ప్రత్యర్థులకు చాన్స్ ఇవ్వకుండా తనదైన శైలిలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడటంతో.. సోషల్ మీడియాలో లోకేష్ పర్యటనలు ఇప్పుడు హైలెట్ అవుతున్నట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇదే స్పీడ్ లో లోకేష్ ప్రజల కోసం పార్టీ కేడర్ కోసం పోరాడితే కచ్చితంగా నెక్స్ట్ టీడీపీ పార్టీ సీఎం అభ్యర్థి లోకేష్ అని పార్టీలో ఉన్న నేతలు అంతర్గతంగా అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.