Lovers Suicide: కృష్ణాజిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి సమీపంలో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి వారు తనువు చాలించి ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపారు.
వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన సాయి (22), అదే గ్రామానికి చెందిన బాలిక (14) ప్రేమించుకున్నారు. బాలిక మైనర్ కావడంతో వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరని భావించి శనివారం ఇంట్లో నుండి బయటకు వచ్చేశారు. ఇటు యువకుడు, అటు బాలిక ఇద్దరూ ఇంట్లో కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. సమీప గ్రామాల్లో విచారించారు. యువతీ యువకులు పెదకళ్లేపల్లి వద్ద ఓ చెట్టుకు ఊరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇరువురు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చల్లపల్లి ఎస్ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలిక 14 ఏళ్లకే ప్రేమలో పడి ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏమిటంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
Read More: Covaxine: ఆ 4 కోట్లు డోసులు ఏమయ్యాయి..!? కోవక్జిన్ లో తప్పుతున్న లెక్క..!?