MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలలో రాజకీయం సాధారణ ఎన్నికలకు మించి జరుగుతోంది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానల్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారిన నేపథ్యంలో ఇరు ప్యానల్స్ మధ్య ఇప్పటి వరకూ ఆరోపణలు, పత్యారోపరణలతో మాటల యుద్ధం జరిగింది. తాజాగా ఫిర్యాదుల వరకూ వెళ్లింది. ఎన్నికల్లో ఎలా గెలిచాము అన్నది ప్రధానం కాదు, గెలిచామా లేదా అన్నదే ప్రధానం. అడ్డదారా ? లేకా ఇంకేదైనా కావచ్చు. సాధారణ ఎన్నికల్లో ఎన్నికల నియమావళి ప్రకారం మద్యం, మనీతో ప్రలోభాలకు గురి చేయకూడదు. కానీ దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇవి చేస్తూనే ఉంటాయి. ఉద్యోగుల నుండి పోస్టల్ బ్యాలెట్ లను రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులే ముందుగా తీసుకుని వారే వాటిని అందజేస్తుంటారు. ఇటువంటివి రాజకీయాల్లో జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు మా ఎన్నికల్లోనూ ప్రత్యర్ధులపై పైచేయి సాధించేందుకు గెలుపు లక్ష్యంగా మంచు విష్ణు ప్యానల్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
ఎన్నికల అధికారికి ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు
ఈ క్రమంలో భాగంగా విశాఖ, మద్రాస్ తదితర ప్రాంతాల్లో ఉన్న నటులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ లను మంచు విష్ణు బ్యాచ్ సేకరిస్తోంది. ఈ విషయాలను తెలుసుకున్న ప్రకాష్ రాజ్ మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్, జీవితా రాజశేఖర్ తో కలిసి ఆయన కంప్లెయింట్ చేశారు. మా ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తున్నారంటూ ఎన్నికల సహాయ అధికారి నారాయణరావుకు లేఖ అందించారు. పోస్టల్ బ్యాలెట్ లో మంచు విష్ణు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాదాపు 60 మందితో అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ప్రకాశ్ రాజ్ విమర్శించారు.
కృష్ణంరాజు, చిరంజీవి స్పందించాలి
పోస్టల్ బ్యాలెట్ అర్హత ఉన్న సభ్యుల నుండి విష్ణు ప్యానెల్ సంతకాలు సేకరిస్తుందన్నారు. నిన్న సాయంత్రం ఒక వ్యక్తి 56 మందికి పోస్టల్ బ్యాలెట్ డబ్బు కట్టారని, పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేయాలంటే సభ్యుడు వ్యక్తిగతంగా మా కు లేఖ రాసి డబ్బు కట్టాలన్న నిబంధన ఉందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. కృష్ణ, కృష్ణంరాజు, శారద పరుచూరి బ్రదర్స్, శరత్ బాబు తదితరుల ఫీజులనూ విష్ణు తరపు వ్యక్తే కట్టారని, ఆగంతుకులతో మా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు గెలిచేందుకు ఇంత దిగజారుతారా అని నిలదీశారు. హామీలు ఇచ్చి గెలవాలని సవాల్ విసిరారు. దీనిపై కృష్ణంరాజు, చిరంజీవి, నాగార్జున పెదవి విప్పాలని ప్రకాశ్ రాజ్ డిమాండ్ చేశారు. ఇంత అసహ్యంగా మా ఎన్నికలా అంటూ ప్రకాశ్ రాజ్ కంట తడి పెట్టారు. విష్ణు తాలూకు వ్యక్తి డబ్బులు చెల్లించి, మళ్లీ తీసుకువెళ్లిన తాలూకు రసీదులను మీడియాకు చూపించారు ప్రకాశ్ రాజ్.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?