MAA Polls: సెప్టెంబర్లో జరగాల్సిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవికి రేసులో సినీనటుడు ప్రకాశ్ రాజ్, హీరో మంచు విష్ణుతో పాటు జీవితా రాజశేఖర్, హేమ ఉన్నట్లు ప్రకటించడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రకాశ్ రాజ్ తన ప్యానల్ సభ్యులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More: Navaneet Kaur: శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్..! కారణం అదేనంట..!!
ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అని తెరపైకి తీసుకురావడం అర్థరహితమన్నారు. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారంతా భారతీయ కళాకారులేనన్నారు. ఇక్కడ ప్రాంతీయతత్వం ఉండదననారు. మాలో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికీ పోటీ చేసే అర్హత ఉంటుందన్నారు. సభ్యత్వం ఉన్న నటుడుగా ప్రకాశ్ రాజ్ కు పోటీ చేసే అర్హత ఉందని అన్నారు. అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సరైన వ్యక్తి ప్రకాశ్ రాజ్ అని పేర్కొన్నారు. ఎవరితోనైనా పని చేయించుకోగలిన చాకచక్యం ప్రకాశ్ రాజ్ కి ఉందన్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్ లో సేవాదృక్పతం ఉందని అన్నారు. సోదరుడు చిరంజీవి నేరుగా ప్రచారంలో అయితే పాల్గొనరు గానీ ప్రకాశ్ రాజ్ కు చిరు అశీస్సులు ఉన్నాయని నాగబాబు స్పష్టం చేశారు.
మా అసోసియేషన్ అధ్యక్ష పదవకి పోటీ చేయాలన్న నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదని, సంవత్సర కాలంగా ప్యానెల్ ఏర్పాటుపై బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో అందరూ అందరికీ కావాల్సిన వారేనని పేర్కొన్నారు. లోకల్, నాన్ లోకల్ అంటూ కొందరు విమర్శించడంపై స్పందిస్తూ కళాకారులు అందరూ యూనివర్సల్ అని వ్యాఖ్యానించారు. అకారణ శతృత్వం వద్దని సూచించారు. అవార్డులు వచ్చినప్పుడు, రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు తనను నాన్ లోకల్ అనే ప్రస్తావన ఎందుకు రాలేదన్నారు. మా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తామనీ, అందరూ ఆశ్చర్యపడేలా పని చేస్తామని ప్రకాశ్ రాజ్ హామీ ఇచ్చారు. మా భవనం ఎలా నిర్మిస్తామో ముందే చెబుతామన్నారు. తాను పదవి కోసం రాలేదనీ, పని చేయడానికి వచ్చాననీ ప్రకాశ్ రాజ్ అన్నారు. తాను చిన్న తప్పు చేసినా ప్రశ్నించే వారు తన ప్యానల్ లో ఉన్నారన్నారు. అదే విధంగా అధ్యక్షులుగా చేసిన వారు నలుగురు తమ పక్షాన ఉన్నారని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.