Madanapalli : చిత్తూరు జిల్లా మదనపల్లిలో మూఢభక్తితో తల్లిదండ్రులే ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేసిన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఆదివారం రాత్రి తమ ఇద్దరు కుమార్తెలు అయిన అలేఖ్య (27), సాయిదివ్య (22)లను మూఢనమ్మకాల పేరుతో దారుణంగా హత్య చేశారు. వీరి మూఢ పిచ్చి ఎంత వరకూ వెళ్లింది అంటే చనిపోయిన తమ పిల్లలు తిరిగి బతికి వస్తారనే అధ్యాత్మిక భావనలో ఉన్నారు. ఈ జంట హత్య కేసులో ఏ 1 గా తండ్రి పురుషోత్తం నాయుడు, ఏ 2గా తల్లి పద్మజను పోలీసులు అరెస్టు చేసి విచారించగా భయంకరమైన విషయాలు వెలుగు చూశాయి. వాస్తవానికి వీరంతా విద్యాధికులే అయినా కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్నాయన్న ట్రాన్స్ లోకి వెళ్లిపోయారు.
పురుషోత్తం నాయుడు పెద్ద కుమార్తె అలేఖ్య తొమ్మిదవ తరగతి నుండే తనకు తాను శివస్వరూపంగా చెప్పుకునేదట. తనకు అతీత శక్తులు ఉన్నట్లు ప్రదర్శిస్తూ తన చెల్లికి ఈ మాటలు చెబుతూ వచ్చిందట. ఆమ్మాయికి లేనిపోని భయాలను కల్పించి తన ట్రాన్స్ లోకి తీసుకున్నది. అదే మాదిరిగా తల్లిదండ్రీని పూర్తిగా మూఢభక్తిలోకి తీసుకువెళ్లింది. వీరంతా బయటి వాళ్లతో కలవకుండా ఎప్పుడూ ఇంట్లో రకరకాల పూజలు చేస్తూ వస్తున్నారుట. బయటి వాళ్లతో కలవడం గానీ, మాట్లాడటం కానీ చేసేవారు కాదు.
హత్యాకాండ జరిగిన ఆదివారం రోజంతా ఇంట్లో పూజలు చేస్తూ కడిపారు. ఆ సమయంలో పై అంతస్తులో సాయిదివ్య మ్యూజిక్ వాయిస్తూ ఉన్నట్టుండి కేక వేసింది. మానసిక రోగిలా ప్రవర్తించింది. తల్లిదండ్రులు, సోదరి ముగ్గురూ కలిసి ఆమెను దయ్యం ఆవహించిందని డంబెల్ తో గట్టిగా కొట్టారు. వెంటనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమెను బతికించుకొని తెచ్చేందుకు తనన చంపాలని తల్లిని కోరింది అలేఖ్య. ముగ్గురూ ఇంట్లో నగ్నంగా పూజలు చేశారు. ఆలేఖ్యను పూజ గదిలోకి తీసుకువెళ్లి నోట్లో చిన్న రాగి కలశాన్ని పెట్టి అందులో నవధాన్యాలు పోసి తలపై డంబెల్ తో గట్టిగా కొట్టడంతో అలేఖ్య చనిపోయింది. ఇది సాయంత్రం 4.30 గంటలకు జరిగింది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పురుషోత్తం తన సహచర ఉపాధ్యాయుడుకి చెప్పగా ఆయన ఇంటికివెళ్లి చూడగా రెండు మృతదేహాలు రక్తపు మడుగులో ఉండగా పురుషోత్తం, అతని భార్య క్షుద్రపూజలు చేస్తూ కూర్చున్నారు. తాను కాళికా స్వరూపాన్ని అని తన పిల్లలు ఇద్దరూ పుణ్యలోకాల్లో ఉన్నారంటూ పద్మజ పోలీసుల విచారణలో ఏదేదో మాట్లాడుతోంది. యువతుల అంత్యక్రియలను పోలీసులు వారి బంధువులు, తండ్రి పురుషోత్తం నాయుడుని తీసుకువెళ్లి పూర్తి చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?