మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను వివిధ రాజకీయ పక్షాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించాయి. జ్యోతి రావు పూలే విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఆయన సేవలను కొనియాడారు. తాడేపల్లి లోని క్యాంప్ కార్యాలయంలో పూలే చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నివాళులర్పించారు.
పూలే ఆశయాలను తమ ప్రభుత్వం నెరవేరుస్తొందని సీఎం జగన్ ఈ సందర్భంగా అన్నారు. సామాజిక న్యాయం జరపడమే పూలే లక్ష్యమని, ఆ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తుందని వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాధ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజిని, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఎం జగన్ అన్నారు. “అధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యుడు. చదువులతో నే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు, ఆయన మార్గంలోనే మా పయనం, జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా నివాళులు” అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
అవి రాజకీయ దుమారం రేపే గాలి వార్తలే .. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూపై మంత్రి అమరనాథ్ స్పందన ఇది
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?