Mansas Trust: సింహాచలం ఆలయ భూ అక్రమాల వ్యవహారంలో ప్రభుత్వం చర్యలకు సిద్ధం అయ్యింది. మాన్సాస్ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. గతంలో అశోక్ గజపతిరాజు చైర్మన్ గా ఉన్న సమయంలో సింహాచలం దేవస్థానాల ఇఓగా పని చేసిన దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె రామచంద్ర మోహన్ చట్టవిరుద్దంగా 22 ఏ జాబితా నుండి భూములను తొలగించారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై మంగళవారం ప్రభుత్వం ఆయనపై వేటు వేసింది. అడిషనర్ కమిషనర్ కె రామచంద్రమోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read More: CBI Court: విశ్రాంత ఐఏఎస్ రాజగోపాల్కు సీబీఐ షాక్..!!
Mansas Trust: అక్రమాలపై ఎవరినీ వదిలిపెట్టం
మరో పక్క వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ లు నేడు మీడియాతో మాట్లాడుతూ మాన్సాస్, దేవస్థానం భూముల వ్యవహారంపై కమిటీ విచారణ జరుగుతోందని, త్వరలో నివేదిక వస్తుందన్నారు. ఆ తరువాత చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని అన్నారు. సింహాచలం దేవస్థానం పరిధిలో కొన్ని వేల కోట్ల ఆస్తులు దుర్వినియోగం చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు.