Mansas Trust: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాన్సాస్, సింహాచలం ఆలయాల ట్రస్ట్ చైర్ పర్సన్ నియామకం విషయంలో ఏపీ హైకోర్టు ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనితో అశోక్ గజపతి రాజు ట్రస్ట్ చైర్మన్ గా భాద్యతలు చేపట్టానున్నారు.
ఈ విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. దొడ్డిదారిన అశోక్ గజపతి రాజు మళ్ళీ ట్రస్ట్ చైర్మన్ అయ్యారని విమర్శించారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు వెళ్తున్నామనీ, అతి త్వరలో మళ్ళీ చైర్మన్ కుర్చీ నుండి ఆయనను తప్పకుండా దింపుతామని అన్నారు. సింహాచలం దేవస్థానం భూసమస్య పరిష్కరానికి ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం అయ్యమని చెప్పిన విజయసాయి రెడ్డి.. విశాఖలో ఉన్న దేవాదాయ శాఖ భూములను పరిరక్షించాలన్న అంశంపై చర్చించామన్నారు. సింహాచలం భూముల రక్షణ కోసం ఫెన్సింగ్ గోడ నిర్మించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. దేవాలయాలు భూముల లీజు విషయం పై కూడా చర్చించామని చెప్పారు.
Read More: AP CM YS Jagan: ఏపిలో కర్ఫ్యూ అమలుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!
మాన్సాస్ ట్రస్ట్ లో 14 వేల ఎకరాలకు పైగా భూములు, 14 విద్యా సంస్థలు ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా ఆడిటింగ్ జరగడం లేదని విజయసాయి ఆరోపించారు. అడిటింగ్ లో అవకతవకలు జరిగితే సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ లో 135 ఎకరాలు చట్ట విరుద్ధంగా అమ్మకం చేపట్టారని విమర్శించారు. మాన్సాస్ ట్రస్ట్ లో పాత రిజిస్టర్ నుండి కొత్త రిజిస్టర్ మార్చినప్పుడు అశోక్ గజపతి రాజు 500 ఎకరాలు కొట్టేసారని తీవ్ర ఆరోపణ చేశారు. భూ అక్రమణలను వైసీపీ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనీ, ఎంత పెద్ద వ్యక్తి అయినా ఉపేక్షించేది లేదనీ, చట్టపరంగా చర్యలు ఉంటాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.