Mekapati Goutham Reddy Funeral: ఏపి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అమెరికా నుండి చదువుకుంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు రావాల్సి ఉండటంతో బుధవారం అంత్యక్రియలను వారి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా బ్రాహ్మణపల్లిలో నిర్వహించాలని ముందుగా తలపెట్టారు. అయితే కుటుంబ సభ్యులు అంత్యక్రియల స్థలాన్ని మార్పు చేశారు. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద అంత్యక్రియలను నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.
Read More: YS Jagan: మేకపాటి కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం జగన్, భారతి దంపతులు
Mekapati Goutham Reddy Funeral: ఉదయగిరిలో
గౌతమ్ రెడ్డి భౌతికాయాన్ని మంగళవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్ లో నెల్లూరుకు తరలించనున్నారు. జిల్లా ప్రజల సందర్శనార్ధం నెల్లూరులోని మేకపాటి గెస్ట్ హౌస్ లో గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని ఉంచుతారు. బుధవారం అక్కడ నుండి ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల వద్దకు తీసుకువెళతారు. అక్కడే గౌతమ్ రెడ్డి పార్ధివ దేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అంత్యక్రియల్లో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, వైసీపీ నేతలు పాల్గొననున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?