Adimulapu Suresh: ఏపి మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరో సారి అస్వస్థతకు గురైయ్యారు. ఈ రోజు మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయన ఒక్కసారిగా కిందపడిపోయారు. మార్కాపురంలోని తన కళాశాల ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని సురేష్ కు వైద్య పరీక్షలు చేయించారు. బీపీ హెచ్చుతగ్గుల వల్ల ఆయన కింద పడిపోయారని వైద్యులు తెలిపారు. మంత్రి సురేష్ ప్రస్తుతం కళాశాలలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కొద్ది రోజుల క్రితం మంత్రి సురేష్ అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే ఆయనకు వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ వేశారు. నాడు విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రి సురేష్ కు ఫోన్ చేసి పరామర్శించారు కూడా. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు.ఆ తర్వాత స్వగ్రామానికి వచ్చిన సురేష్ నేడు మరో సారి అస్వస్థతకు గురైయ్యారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?