CM Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ కుప్పం పర్యటన ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గ కావడంతో.. జగన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. జగన్ అధికారంలోకి వచ్చాక కుప్పంలో జరిగిన అన్ని ఎన్నికలలో వైసీపీ అత్యధిక స్థానాలు గెలవడంతో.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా కుప్పం లో గెలవాలని జగన్ ప్రత్యేకమైన దృష్టి సాధించారు. ఈ క్రమంలో నేడు కుప్పంలో “వైఎస్ఆర్ చేయూత” మూడో విడత నగదు బదిలీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కుప్పం ప్రజలు వైయస్ జగన్ కు బ్రహ్మరథం పట్టారని అన్నారు. చంద్రబాబు నియోజకవర్గం లో వాతావరణం కుప్పంలా లేదని పులివెందుల మాదిరిగా ఉందని అభివర్ణించారు. ఈరోజు కుప్పం రంగు మారిందని.. వచ్చే ఎన్నికలలో జెండా కూడా మారనుందని జోష్యం చెప్పారు. కుప్పం నుండి కురపం వరకు.. ఇంకా చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు వైసిపి జెండా మాత్రమే ఎగురుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ వీధి వీధి తిరిగినా గాని.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి పట్టం కట్టారని గుర్తు చేశారు. 30 సంవత్సరాలలో చంద్రబాబు చేయలేని దాన్ని మూడు ఏళ్లలో జగన్ చేసి చూపించారని స్పష్టం చేశారు.
వైయస్సార్ చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళల జీవితాల్లో వైయస్ జగన్ వెలుగులో నింపుతున్నారు అన్ని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇప్పటికే సీఎం జగన్ కుప్పంకి చేరుకున్నారు. విజయవాడ నుండి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎంని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతం పలికారు. సీఎం హోదాలో జగన్.. ఫస్ట్ టైం చంద్రబాబు నియోజకవర్గంలో అడుగుపెట్టడంతో.. జగన్ కుప్పం తాజా పర్యటన ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.