AP 10th Exams: కోవిడ్ కారణంగా గడచిన రెండు సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్ధులు అందరు పాసయ్యారు. అందరినీ పరీక్షలు రాయకుండానే పాస్ చేసేశారు. ఈ సంవత్సరం పరీక్షలు పరీక్షలు ప్రశాంతంగా జరుగుతాయి అనుకుంటే సంవత్సరం మొత్తం తరగతులు సాఫీగానే సాగాయి. పరీక్షలకు విద్యార్ధులు సిద్ధం అవుతున్నారు. కానీ ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా మూడవ దశ పెరుగుతుండటం, ఓమిక్రాన్ వల్ల పలు పాఠశాలలు మూతపడుతుండటం, పక్క రాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతుంటంతో అసలు మన రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయా లేదా సందేహం నెలకొంది. గత రెండేళ్ల మాదిరిగానే ఈ సారి కూడా అందరూ పాస్ యేనా అన్న సందేహం నెలకొంది. దీనిపై ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ రోజు స్పందించారు. విద్యార్ధులు అందరూ గతంలో మాదిరిగా పరీక్షలు జరగవు. పాస్ చేస్తారు అనుకుంటున్న తరుణంలో, పరీక్షలు జరగవేమో అన్న పుకార్లు వ్యాపిస్తున్న దశలో మంత్రి సురేష్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చారు.
కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు నిర్వహించలేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లోనూ పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలన్న కృతనిశ్చయంతో ఉంది. టెన్త్ పరీక్షలపై వినుకొండలో మంత్రి సురేష్ మాట్లాడుతూ మార్చిలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సంక్రాంతి నాటికి సిలబస్ మొత్తం పూర్తి చేయాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. ఈ సారి ఏడు సబ్జెక్ట్ ల్లో పరీక్షలు ఉంటాయని ఉంటాయని మంత్రి సురేష్ వివరించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాల అమలులో జగన్మోహనరెడ్డి సర్కార్ వెనుకంజ వేయడం లేదని తెలిపిన మంత్రి సురేష్..అమ్మఒడి మూడవ విడతను విద్యాసంవత్సరం ఆరంభంలో ఇస్తామని తెలియజేశారు.
టీ.... ఈ పేరు చెబితే చాలు ఎక్కడిలేని ఎనర్జీ పుట్టుకుని వస్తుంది. ఈ ప్రపంచంలో ఎంతో మంచి టీ ను బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కొందరికి…
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ నిర్వహిస్తొంది. దీంతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలోని…
ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఒక్కోసారి కెరీర్ స్లో అవుతూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్టు వస్తే మళ్లీ వెండి తెరను…
బాలీవుడ్ టాప్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ప్రస్తుతం దర్శకుడిగా కంటే నిర్మాతగా ఎక్కువ బిజీగా ఉన్నాడు. అయితే నెపోటిజాన్ని బాలీవుడ్ అంతటా పెంచేందుకు కరణ్…
ప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమొగుతున్న సంగతి తెలిసిందే. "బాహుబలి 2", "RRR" సినిమాలతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏకంగా ₹1000 కోట్లకు…
కొందరు హత్యాచారం లాంటి నేరాలు చేసి సాక్షం దొరకకుండా తప్పించుకోవాలని అనుకుంటుంటారు. కానీ ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ పరిశీలన, సాంకేతిక ఆధారాలతో పోలీసులు.. దోషులను పట్టుకుంటారు.…