Earth Quake: ఏపిలో ఈ ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ప్రకాశం జిల్లాలోని ముండ్లమరు మండలంలో భూప్రకంపనలు సంభవించాయి. ఇవేళ ఉదయం కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురైయ్యారు. ప్రజలు ఇళ్లలో నుండి బయటకు పరుగులు తీశారు.
అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం సంభవించలేదని సమాచారం. గతంలోనూ ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. గ్రానైట్ క్వారీలు ఎక్కువగా ఉండటం, క్వారీయింగ్ ఎక్కువగా జరుగుతుండటం వల్ల అప్పుడప్పుడు ఈ విధంగా ప్రకంపనలు సంభవిస్తుంటాయని భావిస్తుంటారు.