ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంలో వివాదం కొనసాగుతూనే ఉంది. చంద్రశేఖర్ రెడ్డి తనకు తండ్రి అని, తాను ఆయన కుమారుడిని అని బెంగళూరులో స్థిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శివచరణ్ రెడ్డి ఇటీవల బహిరంగ లేఖ విడుదల చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనను కుమారుడుగా అంగీకరించాలనీ, డీఎన్ఎ పరీక్షకు సిద్దమంటూ పేర్కొన్నారు. శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన చంద్రశేఖర్ రెడ్డి .. అతని తండ్రి కొండారెడ్డి అని పేర్కొన్నారు. ఇదే క్రమంలో చంద్రశేఖర్ రెడ్డి తన తల్లి, తనతో ఉన్న ఫోటోలను శివచరణ్ రెడ్డి విడుదల చేశారు. శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలను చంద్రశేఖర్ రెడ్డి ఖండించిన నేపథ్యంలో శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి స్పందించారు.
రెండేళ్ల పాటు తన చుట్టూ తిరిగి బెంగళూరులో 18 ఏళ్లపాటు కాపురం చేసి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తనను వదిలిపెట్టారని లక్ష్మీదేవి ఆరోపించారు. శాంతి కుమారి పరిచయం అయిన తర్వాత శేఖర్ రెడ్డి లో మార్పు వచ్చిందని, ఆమె వల్లనే తమకు దూరంగా శేఖర్ రెడ్డి ఉన్నారని లక్ష్మీరెడ్డి పేర్కొన్నారు. డబ్బులు, ఆస్తుల కోసమే తాము ఆరోపణలు చేస్తున్నామని శేఖర్ రెడ్డి అనడం సరికాదని అన్నారు. చంద్రశేఖర్ రెడ్డి మాట్లలతో అవమానం భరించలేక ఇప్పుడు బయటకు రావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. తమకు సొంత ఇల్లు కూడా లేదనీ, శాంత కుమారి వద్ద ఎన్ని ఆస్తులు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమేనన్నారు.
తనకు ఆస్తులు, రాజకీయ వారసత్వం ముఖ్యం కాదనీ, శేఖర్ రెడ్డి తనయుడుగా గుర్తింపు మాత్రమే కొరుకుంటున్నానని శివచరణ్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లక్ష్మీదేవి ఆరోపణలపై చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. చంద్రశేఖర్ రెడ్డి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నారనీ, కుమారులు లేరని పేర్కొనడంతో శివచరణ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ వివాదం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారగా, ఆయనకు ఓ పెద్ద తలనొప్పిగా మారింది.