NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు .. సీఎం చొరవతో మైలవరంలో వివాదానికి తెర పడినట్లే(గా)..!

మైలవరం నియోజకవర్గ వైసీపీలో వర్గ పోరు ఇటీవల తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి వచ్చింది. మంత్రి జోగి రమేష్ పెడన నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆయన సొంత ప్రాంతం మైలవరం నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం కావడం కావడం, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనకు ఇక్కడ బలమైన వర్గం ఉంది. 2019 ఎన్నికల్లో జోగి రమేష్ ను పెడనకు పంపించిన వైసీపీ  ఇక్కడ నుండి వసంత కృష్ణ ప్రసాద్ ను పోటీకి నిలిపింది. పెడనలో జోగి రమేష్, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ లు గెలిచారు. తొలి నాళ్లలో ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా తర్వాత జోగి రమేష్ వర్గీయులకు, వసంత వర్గీయులకు మధ్య తేడాలు వచ్చాయి. మైలవరం నియోజకవర్గ విషయంలో మంత్రి హోదాలో జోగి రమేష్ కల్పించుకోవడంతో వసంత కృష్ణ ప్రసాద్ మనస్థాపానికి గురైయ్యారు.  వీరి మధ్య నెలకొన్న వివాదాల వ్యవహారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు చేరిన విషయం తెలిసిందే.

Mylavaram YSRCP Internal Politics

 

వారి మధ్య గత కొంత కాలంగా ఉన్న విభేదాలు సోషల్ మీడియాలో పరస్పరం వ్యతిరేకంగా ప్రచారం చేయించుకునే వరకూ వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొద్ది రోజుల నుండి నిర్వహించకుండా సైలెంట్ అయిపోయారు వసంత కృష్ణ ప్రసాద్. ఈ వ్యవహారం పరిష్కరించే క్రమంలో భాగంగా సీఎం జగన్మోహనరెడ్డి రీసెంట్ గా జరిగిన కేబినెట్ భేటీ తర్వాత జోగి రమేష్ తో ప్రత్యేకంగా మాట్లాడినట్లుగా ప్రచారం జరిగింది. పక్క నియోజకవర్గాల్లో వేలు పెట్టవద్దని, ఎవరి నియోజకవర్గాల్లో వారు కార్యక్రమాలను నిర్వహించుకోవాలని గట్టిగా చెప్పినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వసంత కృష్ణప్రసాద్ ను తాడేపల్లికి పిలిపించుకుని జగన్ మాట్లాడారు. వారి మధ్య సుమారు అరగంట పాటు జరిగిన సమావేశంలో మైలవరం లో జరుగుతున్న వ్యవహారాలపై అంశాల వారీగా చర్చ జరిగినట్లు తెలిసింది. సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇస్తూ గో హెడ్ అనడంతో మైలవరం నియోజకవర్గ విభేదాలు, వివాదాలకు తెరపడినట్లు అయ్యింది.

YSRCP

 

వసంత కృష్ణప్రసాద్ శుక్రవారం మీడియాతో మాట్లాడిన దాని బట్టి చూస్తే ఆ విషయం స్పష్టం అవుతోంది. తాను ఎవరి నియోజకవర్గంలోనూ జోక్యం చేసుకోననీ, తన నియోజకవర్గంలో ఎవరైనా కలుగజేసుకుంటే మాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు వసంత కృష్ణ ప్రసాద్. విబేధాలకు సంబంధించిన విషయాలు తమ వరకు రాకముందే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేయడం సరికాదని, ఇకపై ఆ పని చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జగన్ తనకు సూచించారని కృష్ణప్రసాద్ తెలిపారు. గతంలో ముగ్గురు మంత్రులతో పని చేస్తే ఎప్పుడూ వారితో విభేదాలు రాలేదనీ, తన నియోజకవర్గంలో జోగి రమేష్ వేలు పెట్టడంతోనే సమస్య వచ్చిందని కేపి వ్యాఖ్యానించారు.

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మార్చి 10కి వాయిదా.. నిందితులు చంచల్‌గూడ జైలుకి తరలింపు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju