వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజును మూడు రోజుల పాటు విచారణ చేసేందుకు గానూ ఏపీ సీఐడీ అధికారులు నేడు హైదరాబాద్ చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్ దిల్ కుషా అతిధి గృహంలో విచారణకు రావాలని రఘురామ కృష్ణంరాజుకు సీఐడీ అధికారులు నోటీసు జారీ చేశారు. ముగ్గురు మధ్యవర్తుల సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డిప్యూటి తహశీల్దార్, మరోకరి ముందు విచారించాలని సీఐడీ అధికారులు నిర్ణయించారు. ఎంపీ రఘురామకు గుండె సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నందున సీఐడీ అధికారుుల వైద్య నిపుణుడిని ఏర్పాటు చేశారు. ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్పీలు, జయసూర్య, గోపాలకృష్ణ , ఇద్దరు సీఐలు, మరో ఇద్దరు ఎస్ఐలు రఘురామ ను విచారించేందుకు ప్లాన్ చేసుకోగా, ఎంపీ రఘురామ ఈ రోజు విచారణకు రాలేకపోతున్నానంటూ అధికారులకు సమాచారం అందించారు.
గతంలో తనను అరెస్టు చేసిన సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. కొద్ది నెలల క్రితం కేసు విచారణకు హజరుకావాలంటూ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కోర్టు ఆశ్రయించి గతంలో జరిగిన విషయాలను న్యాయమూర్తికి వివరించగా, హైదరాబాద్ లోని ప్రభుత్వ అతిధి గృహంలో విచారించేందుకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీఐడీ విచారణకు రఘురామ సహకరించాలని సూచిస్తూనే విచారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐడీకి అదేశించింది. కోర్టు సూచనల పాటిస్తూ సీఐడీ అధికారులు విచారణ చేసేందుకు సిద్దమవ్వగా, రఘురామ తొలి రోజు విచారణకు డుమ్మా కొట్టారు. దీనిపై సీఐడీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.
AP High Court: ఎంపీ రఘురామ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు ..ఏపీ సీఐడీ విచారించవచ్చు కానీ..