Raghurama: ఏపిలో వైసీపీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ఇరుకున పెట్టే ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ పార్టీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు వదిలిపెట్టడం లేదు. గత ఏడాదిన్నరగా రఘురామ కృష్ణం రాజు వైసీపీ సర్కార్ పై నిత్యం విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. ఈ నేఫథ్యంలో ఆయనపై ఏపీ సీఐడీ రాజద్రోహం తదితర సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం, జైలులో ఆయన పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపణలు చేయడం, అనంతరం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. ఆ తరువాత కొద్ది రోజులు మీడియా ముందు రాకుండా ఉన్న రఘురామ కృష్ణం రాజు మళ్లీ ప్రభుత్వంపై విజృంభిస్తున్నారు. తాజాగా ఏపి ప్రభుత్వానికి సంబంధించి ఓ అంశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఫిర్యాదు చేయడంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Raghurama: కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడం సరికాదు
విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ పథకాలకు వైఎస్ఆర్, జగనన్న పేర్లు పెట్టి అమలు చేస్తున్నారు. అయితే కొన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేసే పథకాలకు జగనన్న పేరు పెట్టడంపై రఘురామ కృష్ణంరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రఘురామ కృష్ణంరాజు ఫిర్యదుపై స్మృతీ ఇరానీ సీరియస్ గా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు మార్చడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాలు తమకు నచ్చినట్లు పథకాలకు పేర్లు మార్చుకోవడం సరికాదని ఆమె పేర్కొన్నారు. రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదుపై ఏపి ప్రభుత్వం వివరణ ఇవ్వాలనీ, ఏపి ప్రభుత్వానికి లేఖ రాసినట్లు స్మృతి ఇరానీ తెలిపారు. అంతే కాకుండా 2021 – 22 ఆర్ధిక సంవత్సరానికి ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.187 కోట్లకు సంబంధించి లెక్కలను పంపాలని ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపిలో జగనన్న గోరుముద్ద, వైెఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న పాల వెల్లువ అనే పేర్లను పెట్టడాన్ని కేంద్రం తప్పుబట్టింది.