MP RRR Case: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు ఇటీవల ఏపీ సీఐడీ అధికారులకు తన ఐఫోన్ అప్పగించాలంటూ లీగల్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ నుండి మేసేజ్ లు వెళ్లాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఏపి సీఐడీ స్పందించింది. రఘురామ దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమకు చెప్పిన దానికి, ఢిల్లీ పోలీసుల ఫిర్యాదుకు తేడా ఉందన్నారు.
Read More: YS Sharmila Party: వైఎస్ షర్మిల పార్టీ ఆవిర్భావ ముహూర్తం ఖరారు..! ఎప్పుడంటే..?
రఘురామ మొబైల్ ఫోన్ (యాపిల్ 11) మే 15న స్వాధీనం చేసుకున్నామనీ, మొబైల్ సీజ్ చేసిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలియజేశామన్నారు. ఫోన్ ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ కు పంపించామనీ, తరువాత ఫోన్ డాటాను మే 31న కోర్టుకు అందించామనీ సీఐడీ తెలిపింది. రఘురామ కృష్ణం రాజు తమకు చెప్పిన ఫోన్ నెంబర్, ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫోన్ నెంబర్ వేరువేరుగా ఉన్నాయని సీఐడీ తెలిపింది. దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించేలా రఘురామ ఫిర్యాదు ఉందని సీఐడీ అసంతృప్తి వ్యక్తం చేసింది.