MP RRR Case Effect: నర్సాపురం ఎంపి కె రఘురామ కృష్ణం రాజు కేసు విషయంలో ఏపి సీఐడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పాటించనందుకు కోర్టు దిక్కరణ కింద నోటీసులు జారీ చేయాలని జ్యూడీషియల్ రిజిస్టార్ కు ఆదేశాలు జారీ చేసింది. రఘురామ కృష్ణం రాజు కేసు విషయంలో గుంటూరు మెజిస్ట్రేట్ ఆర్డర్స్ను రద్దు చేయాలంటూ ఏపి ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
రఘురామకృష్ణం రాజు విషయంలో హైకోర్టు, మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ బోర్డు రిపోర్టు ఇవ్వాలని అదేశించినా సాయంత్రం 6 గంటల వరకూ ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. రాత్రి 11 గంటలకు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకూ మీరు ఎందుకు స్పందించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రాధమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సీఐడీ అదనపు డీజీ, ఎస్హెచ్ఓకు నోటీసులు ఇవ్వాలని జ్యూడీషియల్ రిజిస్టార్ కు హైకోర్టు ఆదేశించింది.