MP Vijayasai Reddy: రష్యా సైనిక చర్య కారణంగా ఉక్రెయిన్ నుంచి వేలాది మంది వైద్య విద్యార్ధులు భారతదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ గంగ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా విద్యార్ధుల తరలింపు ప్రక్రియను పూర్తి చేసింది. అయితే భారత్ కు తిరిగి వచ్చిన వైద్య విద్యార్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో వీరికి దేశీయ వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశం కల్పించి చదువు కొనసాగించేలా చర్యలు చేపట్టి ఆదుకోవాలని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read More: CM YS Jagan: సీఎం జగన్ నోట మంత్రివర్గ విస్తరణ మాట..? కేబినెట్ లో హాట్ డిస్కషన్..!!
MP Vijayasai Reddy: వైద్య విద్యార్ధులను క్షేమంగా తీసుకువచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు
రాజ్యసభలో సోమవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. ఉక్రెయిన్లో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడ వివిధ విశ్వ విద్యాలయాల్లో వైద్య విద్యను అభ్యసిస్తూ చిక్కుబడిపోయిన వేలాది మంది భారతీయ విద్యార్ధులను క్షేమంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను విజయసాయి ఈ సందర్భంగా అభినందించారు. అయితే ఇప్పుడు అర్థాంతరంగా నిలిచిపోయిన తమ చదువులపై వారు ఆందోళన చెందుతున్నారని విజయసాయి చెప్పారు. ఉక్రెయిన్లో పరిస్థితులు ఇప్పట్లో చక్కబడే అవకాశాలు కనిపించడం లేదన్నారు.
ప్రత్యేక కేటగిరీగా పరిగణించి…
ఇలాంటి అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మానవతాధృక్పదంతో, అరుదైన కేసుగా పరిగణించి ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన మెడికల్ విద్యార్ధులు దేశీయ యూనివర్శిటీలలో తమ చదువును కొనసాగించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు. ప్రస్తుతం దేశంలో ఏదైనా మెడికల్ కళాశాల మూతబడిన పక్షంలో విద్యార్ధులను వివిధ మెడికల్ కళాశాల్లో సర్దుబాటు చేసే విధానాన్ని అనుసరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉక్రెయన్ నుంచి తిరిగి వచ్చిన మెడికల్ విద్యార్ధుల విషయంలో కూడా అలాంటి ప్రత్యేక బదిలీ విధానాన్ని రూపొందించాలని విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.