29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: మొదటి సారి సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?

Share

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు లో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలోని బృందం సుమారు నాలుగున్నర గంటల పాటు విచారణ జరిపింది. సీబీఐ కార్యాలయం నుండి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

YS Avinash Reddy

 

సీబీఐ అధికారులు ఇచ్చిన 160 సీఆర్పీసీ నోటీసుల ప్రకారం విచారణకు హజరయ్యాననీ, విచారణ పారదర్శకంగా జరగాలని తాను సీబీఐ అధికారులను కోరినట్లు చెప్పారు అవినాష్ రెడ్డి. అధికారులు అడిగిన ప్రశ్నలకు తమకు తెలిసినంత వరకు సమాధానాలు ఇచ్చానన్నారు. సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలను సమాధానాలతో నివృత్తి చేశానని తెలిపారు. మరల అవసరమైతే కొద్ది రోజుల్లో విచారణకు పిలుస్తామని చెప్పారనీ, మళ్లీ ఎప్పుడు విచారణకు రమ్మన్నా వస్తానని తెలిపానన్నారు. నాలుగు గంటల పాటు తనను విచారించారని చెప్పారు. విచారణకు సంబంధించిన విషయాలు ఏవీ ఇప్పుడు బహిర్గతం చేయలేనన్నారు.

ప్రజలకు కేసుకు సంబంధించి వివరాలు తెలియాలని వీడియో, ఆడియో అనుమతి కోరాననీ, తనతో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోరాననీ, అయితే అందుకు సీబీఐ విచారణ అధికారి అంగీకరించలేదని తెలిపారు అవినాష్ రెడ్డి. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అవినాష్ రెడ్డి అన్నారు. మొదటి సారి అవినాష్ రెడ్డి సీబీఐ కార్యాలయానికి విచారణకు హజరు కావడంతో పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కోటి సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Amrit Udyan: కేంద్రం కీలక నిర్ణయం .. రాష్ట్రపతి భవన్ లోని మొఘల్ గార్డెన్ కు  అమృత్ ఉద్యాన్ గా పేరు మార్పు


Share

Related posts

మార్కజ్ నుంచి వచ్చిన 64 మంది విదేశీయులను అదుపులోకి టేసుకున్న తెలంగాణ పోలీసులు

Siva Prasad

“థాంక్యూ జగన్ అంకుల్” ఏపీ అంతా కేక్ కటింగ్ లు!

CMR

Water : నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? అయితే ఒక్కసారి ఇది తెలుసుకోండి!!

Kumar