NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

సీబీఐ నోటీసుపై వైఎస్ అవినాష్ రెడ్డి స్పందన ఇది

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలకు సీబీఐ మరో సారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి నేడు స్పందించారు. సీబీఐ విచారణ ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వేంపల్లిలో సోమవారం జరిగిన వలంటీర్లు, గృహ సారధుల సమావేశంలో అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ విచారణకు 10వ తేదీ హజరవుతానని చెప్పారు. తన తండ్రి భాస్కరరెడ్డి 12వ తేదీన కడపలో విచారణకు హజరవుతారని వెల్లడించారు. సీబీఐ విచారణ ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు చెబుతానంటూ వ్యాఖ్యానించారు అవినాష్ రెడ్డి,

YS Avinash Reddy

 

వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మొన్న సీబీఐ అధికారులు మరో సారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలతో ఆరవ తేదీ విచారణకు హజరు కాలేనంటూ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. దీంతో నిన్న రాత్రి పులివెందుల లోని అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లి  నోటీసులు అందజేశారు. ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే 12వ తేదీన కడపలో విచారణకు హజరు కావాలని అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డికి నోటీసులు అందించారు. అయితే ఈ సారి విచారణకు కచ్చితంగా హజరుకావాలని సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

MP Avinash Reddy

 

అవినాష్ రెడ్డిని ఇప్పటికే రెండు పర్యాయాలు సీబీఐ అధికారులు విచారణ చేశారు. మొదటి సారి విచారణ సందర్భంలో మరో సారి విచారణ రావాల్సి ఉంటుందని చెప్పిన సీబీఐ అధికారులు, రెండవ సారి విచారణ సమయంలో మరో సారి రావాల్సి ఉంటుందని తెలుపలేదు. ఆ సమయంలో సీబీఐ అధికారుల దర్యాప్తు తీరుపై అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వ్యక్తి టార్గెట్ గా విచారణ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆ నేపథ్యంలో అవినాష్ రెడ్డిని మూడో సారి విచారణకు పిలవడం హాట్ టాపిక్ అయ్యింది.

వివేకా హత్య జరిగిన విషయం ఉదయం ఆరు గంటలకు అందరికీ తెలియగా, అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డికి అంతకు ముందే తెలుసునని సీబీఐ భావిస్తొంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు తుడిచివేయడం, మృతదేహానికి కట్టుకట్టి ఆసుపత్రికి తరలించడం, గుండె పోటుగా ప్రచారం చేయడంలో అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి కీలక పాత్ర పోషించారని సీబీఐ అనుమానిస్తున్నది. వివేకా హత్య జరిగిన ముందు రోజు మార్చి 14వ తేదీ సాయంత్రం నిందితుల్లో ఒకరైన సునీల్ యాదవ్ పావు గంట పాటు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నాడని గుగుల్ టేక్ అవుట్ ద్వారా సీబీఐకి అధారాలు లభించాయి. దీంతో వివేకా హత్య కేసులో వీరి కుట్ర ఉండవచ్చని సీబీఐ అనుమానిస్తున్నది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో మంత్రి అంబటి రాంబాబు సంచలన కామెంట్స్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?