Mudragada Padmanabham ముద్రగడ పద్మనాభం… మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత. గత కొద్దికాలంగా ఆయన రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు.
తాజాగా సంచలన కామెంట్లతో ఆయన తన ఉనికిని చాటుకుంటున్నారు. ఇదే సమయంలో ఆయన రాజకీయ రీ ఎంట్రీపై కొత్త చర్చ జరుగుతోంది. ఆయన్ను పార్టీలోకి ఏపీ బీజేపీ రథసారథి సోము వీర్రాజు ఆహ్వానించారు. అయితే, ఆయన చేరలేదు. ఇప్పుడు అధికార వైసీపీ కి నచ్చే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో కొత్త చర్చ తెరమీదకు వస్తోంది.
Mudragada Padmanabham ముద్రగడ మెలిక….
కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృత స్థాయికి తీసుకెళ్లిన ముద్రగడ పద్మనాభం తనపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలకు మనస్తాపం చెంది ఉద్యమం వదిలేశారు. రాజకీయంగా ఏ పార్టీకి కూడా సంబంధం లేకుండా ఉన్నారు. అలాంటి సమయంలో ఇటీవల ఏపీ బీజేపీ సారథి సోము వీర్రాజు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో భేటీ అయ్యారు. ఇది వ్యక్తిగత భేటీ కాదని తేల్చేశారు వీర్రాజు. ముద్రగడను బీజేపీలోకి ఆహ్వానించినట్టు ఆయన మాటల ద్వారా అర్థమవుతోంది. ముద్రగడ కూడా ఒకప్పుడు కొంతకాలంపాటు బీజేపీలో పనిచేయడం గమనార్హం.
కాపుల కోసం ముద్రగడ…
అయితే తన చేరికపై ముద్రగడ పద్మనాభం ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. పార్లమెంట్లో పెండింగ్లో ఉన్న కాపుల రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని.. అలాగే చేస్తే బీజేపీలో చేరతానని ఆయన హామీ ఇచ్చారట. దీనిపై కమలనాథులు ఆలోచనలో పడినట్టు సమాచారం. ఇదే సమయంలో తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తీసుకుంటున్న నిర్ణయాలను ముద్రగడ పద్మనాభం తప్పుపడుతున్నారు. దీంతో కాపు నేత రూటు ఎటు అనే చర్చ జరుగుతోంది.