AP CEO: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి (సీఇఓ) సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా నియమితులైయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఏపి క్యాడర్ కు చెందిన 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనా..రాష్ట్ర విభజన సమయంలో ఏపి కేడర్ కు బదిలీ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఏ పి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు రాజ్ భవన్ కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం ఏ పి ఎన్నికల ప్రధాన అధికారిగా విజయానంద్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఆయన స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనాను నియమించింది. ముఖేష్ కుమార్ మీనా తక్షణం బాధ్యతలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.