బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను బహుకరించారు. నవీ ముంబయి రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి హరికృష్ణారెడ్డి దంపతులు మూడు బంగారు కిరీటాలను తయారు చేయించి అమ్మవారికి సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు.
కనకదుర్గమ్మ ఉత్సవ విగ్రహాల అలంకరణ కోసం సుమారు 1,308 గ్రాములతో చేయించిన మూడు బంగారు కిరీటాలను సోమవారం ఈఓ బ్రమరాంబకు హరికృష్ణారెడ్డి దంపతులు అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం హరికృష్ణారెడ్డి దంపతులు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఇఓ వారికి అమ్మవారి ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం, పట్టు వస్త్రం అందించారు.
జనసేన వైపు ఆ వైసీపీ నేత చూపు .. చేరిక మూహూర్తం ఖరారు అయినట్లే(నా)..?