Municipal Election Results: నెల్లూరు కార్పోరేషన్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 54 డివిజన్లకు గానూ 54 డివిజన్లలో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించి రికార్డు సృష్టించారు. అదే విధంగా కుప్పంతో సహా 9 మున్సిపాలిటీలను వైసీపీ కైవశం చేసుకుంది. వైసీపీ ప్రభంజం ఈ విధంగా కొనసాగుతున్న క్రమంలో ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో అనూహ్యంగా టీడీపీ గెలుపొందింది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతుండగా, కొండపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎంపికకు స్వతంత్ర అభ్యర్ధి కీలకం అయ్యారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీలకు సమాన స్థాయిలో వార్డులు వచ్చాయి.
Read More: AP High Court: అమరావతి రాజధానిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..!!
Municipal Election Results: కొండపల్లిలో వైసీపీ 14 – టీడీపీకి 14 వార్డులు
కొండపల్లి మున్సిపాలిటీలో 29 వార్డులకు గానూ టీడీపీ 14, వైసీపీ 14 గెలుచుకోగా ఒక వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్ధి విజయం సాధించారు. జనసేన, బీజేపీ, వామపక్షాల అభ్యర్ధులు పోటీ చేసినా ఎక్కడా గెలవలేదు. ప్రధాన పార్టీలకు సమాన స్థానాలు రావడంతో కొండపల్లిలో స్వతంత్ర అభ్యర్ధి కీలకం అయ్యాయి. చైర్మన్ ఎంపికకు ఈ ఇండిపెండెంట్ అభ్యర్ధి చాలా కీలకంగా మారిపోయాడు. సదరు ఇండిపెండెంట్ అభ్యర్ధి అధికార వైసీపీకి మద్దతు ఇస్తాడా, లేక ప్రతిపక్ష టీడీపీకి మద్దతు పలుకుతాడా అనేది సర్వత్రా ఆసక్తినెలకొంది. ఆ స్వతంత్ర అభ్యర్ధి ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీకే చైర్మన్ తో సహా రెండు వైస్ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీ మైలవరం నియోజకవర్గ పరిధిలో ఉంది. మైలవరం నియోజకవర్గంలోని ఇంబ్రహీంపట్నం, కొండపల్లి గ్రామాలను కలిసి కొండపల్లి మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికను వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.