Municipal Elections : ఏపిలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. 11 కార్పోరేషన్ లు, 70 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయ్యింది. హైకోర్టు ఉత్తర్వులతో ఏలూరు కార్పోరేషన్, చిలకలూరిపేట మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించలేదు. హైకోర్టు తుది తీర్పు తరువాత ఆ రెండు చోట్ల కౌంటింగ్ చేపట్టనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
11 కర్పోరేషన్ లలో 16 కౌంటింగ్ కేంద్రాలు
విజయనగరం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు పాత బస్టాండ్ సమీపంలో గల రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చేపట్టారు. విజయవాడ కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ఆంధ్ర లయోలా కళాశాలలో, మచిలీపట్నం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ను కృష్ణా యూనివర్శిటీ లో, గుంటూరు కార్పోరేషన్ లో నాలుగు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 1.ఏంబీటిఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, 2.ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ న్యూ బ్లాక్, 3. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్, 4. ప్రభుత్వ టెక్స్ టైల్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ ఓల్డ్ బ్లాక్ లో, ఒంగోలు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ను సెయింట్ క్సావియర్ కళాశాలలో, అనంతపురం కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ఎస్ఎస్ బీమ్ జూనియర్ కళాశాలలో, కర్నూలు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు మూడు కేంద్రాలలో 1. రాయలసీమ యూనివర్శిటీ, 2. సెయింట్ జోసెఫ్ డిగ్రీ, 2.పీజీ మహిళా కళాశాల, 3.పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల లలో, చిత్తూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు సివికెఎస్ ప్రభుత్వ కళాశాలలో, కడప కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు ఆర్ట్ కాలేజీలో, తిరుపతి కార్పోరేషన్ ఓట్ల లెక్కింపును ఎస్విఆర్ట్స్ కళాశాలలో, మున్సిపాలిటీ, నగర పంచాయతీల్లో ఎక్కడికక్కడ అన్ని వార్డులను కలిపి ఒకే కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 10 గంటల నుండి ఫలితాలు వెల్లడి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.