Murder in Kakinada : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అధికార వైసీపీ TCP కి చెందిన కార్పోరేటర్ కంపర రమేష్ Kampara ramesh దారుణ హత్యకు గురైయ్యారు. రమేష్ ను కారుతో గుద్ది హత్య చేసిన విజువల్స్ సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ దారుణ హత్య దృశ్యాలు చూపరుల హృదయాలను కలచివేస్తుంది.
వివరాల్లోకి వెళితే.. కాకినాడ రూరల్ వలసపాకలో 9వ వార్డు కార్పోరేటర్ కంపరా రమేష్ తన స్నేహితులతో గురువారం రాత్రి పార్టీ చేసుకున్నాడు. రెవెన్యూ కాలనీకి చెందిన చిన్నకు రమేష్ ఫోన్ చేసి తాను ఎక్కడ ఉంది చెప్పడంతో చిన్న తన సోదరుడు కుమార్ తో కలిసి అక్కడకు చేరుకున్నాడు. ఆ సమయంలో రమేష్, చిన్నల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో చిన్న, కుమార్ కలిసి కారుతో రమేష్ ను ఢీ కొట్టారు. మూడు సార్లు రమేష్ పై నుండి కారును పోనియ్యడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే రమేష్ హత్య కాకినాడలో తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ హత్యకు రియల్ ఎస్టేట్ లావాదేవీలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
హతుడు రమేష్ 9వ వార్డు కార్పోరేటర్ గా, మున్సిపల్ కార్పోరేషన్ స్థాయి సంఘం చైర్మన్ గా ఉన్నారు. 1992లో ఎన్ ఎస్ యు ఐ కాకినాడ నగర అధ్యక్షుడుగా, 1995లో జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా పని చేసిన రమేష్ 2000 సంవత్సరంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రమేష్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు.