Nandamuri Balakrishana: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన కామెంట్స్ చేశారు. హిందూపురం జిల్లా కోసం దేనికైనా సిద్ధమనీ, అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తానని బాలయ్య పేర్కొన్నారు. హిందూపురంను జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వసతులు ఉన్నాయనీ, హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించి సత్యసాయి జిల్లాగా పేరు పెట్టాలని బాలయ్య డిమాండ్ చేశారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బాలకృష్ణ మౌన దీక్ష కు నిర్ణయించారు. ఈ సందర్భంగా హిందూపురం పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి నుండి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
Nandamuri Balakrishana: రజల దృష్టి మళ్లించడం కోసమే జిల్లాల ప్రకటన
రాష్ట్రంలో ఉద్యోగుల ఆందోళన నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసం రాత్రికి రాత్రి కొత్త జిల్లాలను ప్రకటించారని ఆయన ఆరోపించారు. మన ప్రాంతం, మన రాష్ట్రం బాగుండాలనేది తమ కోరికని అన్నారు బాలకృష్ణ, హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు బాలకృష్ణ. కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు పెడితే టీడీపీ సర్కార్ కొనసాగించిన విషయాన్ని బాలకృష్ణ గుర్తు చేశారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటిన్లను మూసివేశారని విమర్శించారు.
సాయంత్రం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ
అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు బాలకృష్ణ, దీక్షా స్థలానికి బాలయ్య అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకుని హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలంటూ నినాదాలు చేశారు. పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం అఖిలపక్ష నేతలతో బాలకృష్ణ చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?