Nandamuri Balakrishna: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన తనయుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. శనివారం హిందూపురంలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ సతీమణి వసుంధర పట్టణంలో రూ.2లకే నాణ్యమైన భోజనాన్ని అందించే మొబైల్ క్యాంటిన్ ను ప్రారంభించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వసుంధర మొబైల్ క్యాంటిన్ అందించే భోజనాన్ని పంపిణీ చేశారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కిలో బియ్యం రెండు రూపాయలకే అందించారనీ, ఆ పథకం స్పూర్తితోనే రూ.2 లకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగే ఏడాది పొడవునా ప్రతి రోజు మధ్యాహ్నం ఈ భోజనాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. టీడీపీ ఎన్ఆర్ఐ టీమ్, బాలకృష్ణ అభిమానులు సంయుక్తంగా ఈ మెబైల్ క్యాంటిన్ ను ప్రారంభించారని నందమూరి వసుంధర తెలిపారు.