Nandamuri Balakrishna: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆయన తనయుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. శనివారం హిందూపురంలో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొన్న బాలకృష్ణ సతీమణి వసుంధర పట్టణంలో రూ.2లకే నాణ్యమైన భోజనాన్ని అందించే మొబైల్ క్యాంటిన్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో వసుంధర మొబైల్ క్యాంటిన్ అందించే భోజనాన్ని పంపిణీ చేశారు. గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎన్టీఆర్ కిలో బియ్యం రెండు రూపాయలకే అందించారనీ, ఆ పథకం స్పూర్తితోనే రూ.2 లకే నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగే ఏడాది పొడవునా ప్రతి రోజు మధ్యాహ్నం ఈ భోజనాన్ని అందజేయనున్నట్లు చెప్పారు. టీడీపీ ఎన్ఆర్ఐ టీమ్, బాలకృష్ణ అభిమానులు సంయుక్తంగా ఈ మెబైల్ క్యాంటిన్ ను ప్రారంభించారని నందమూరి వసుంధర తెలిపారు.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…