Nara Lokesh: తిరుపతి ఉన్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తుతోంది. బుధవారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విషయంలో తమ కుటుంబానికి ఎటువంటి ప్రమేయం లేదని శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తానని లోకేష్ ఇంతకు సవాల్ విసిరారు. ఈ సవాల్ నేపథ్యంలో బుధవారం లోకేష్ గరుడ సర్కిల్ వద్ద వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రక్తచరిత్ర ఎవరిదో ప్రజలందరికీ తెలుసునన్నారు. కత్తితో వచ్చినోడు ఆ కత్తితోనే పోతాడని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి హత్య కేసు విషయంతో తమ కుటుంబంపై నిరాధారణ ఆరోపణలు చేశారన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వైఎస్ వివేకా హత్యను హత్య చేశారని ఆరోపించారు. వివేకా కూతురు సునీత కోర్టుకెళ్లినా జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. వివేకా హత్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని అన్నారు. సీఎం జగన్ కు దమ్ము ఉంటే శ్రీవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయడానికి అలిపిరికి రావాలని సవాల్ విసిరారు. తాను ఇక్కడే గంట పాటు ఉంటానని జగన్ రెడ్డి ఇక్కడకు రావాలంటే 45 నిమిషాల్లో రావచ్చని అన్నారు. అటు జగన్ రెడ్డి, ఇటు నేను ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా అంటూ లోకేష్ సవాల్ విసిరారు. చిత్తశుద్ధితో మాటపై నిలబడి ప్రమాణం చేయడానికి తాను వచ్చానని లోకేష్ అన్నారు. సొంత బాబాయిని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్ కు లేదా అని లోకేష్ ప్రశ్నించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?