Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు వైసీపీ వాళ్లు బాబును ఓడించాలంటూ క్యాంపైన్ చేశారు ఇప్పుడు రాష్ట్రమే ఓడిపోయింది అని లోకేష్ వ్యాఖ్యానించారు. అన్ని పరిశ్రమలు తరలివెళ్లిపోయాయన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ తరలివెళ్లే వాళ్లం. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన భవిష్యత్తు ఎమవుతుందోనని, మన ఉద్యోగ అవకాశాలు ఏమవుతాయోనని అందరూ బాధపడ్డాం, ఆవేదన చెందమన్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఉందన్నారు.
Read More: Nizamabad: నిజమాబాద్ జిల్లాలో రాజకీయ కుటుంబ కథా చిత్రం..! జిల్లాలో ఇదే హాట్ టాపిక్..!!
ప్రభుత్వం తాజాగా ఆరు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని జాదూ క్యాలెండర్ లో పేర్కొనడం చూసి తననే వింతగా అనిపిస్తోందన్నారు. వైసీపీ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి అయినప్పుడు 4 లక్షల 77 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారనీ, తరువాత 15 రోజుల వ్యవధిలో లక్షా 30వేల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు. కార్యకర్తలకు ఇచ్చిన వాలంటీర్ ఉద్యోగాలను, గ్రామ సచివాలయాల్లో అమ్ముకున్న ఉద్యోగాలను, దశాబ్దాలుగా ఆర్ టీ సీలో పని చేస్తున్న కార్మికులను, దాదాపు 95వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలను వీటిలో కలిపేసి లెక్కలు చెప్పారని విమర్శించారు. ఇవన్నీ తీసివేస్తే ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 15 వేలు మాత్రమేనని లోకేష్ స్పష్టం చేశారు.
ఓ సినిమాలో ఒకరు రూపాయి ఇచ్చి పండుగ చేసుకో అని బ్రహ్మనందం అన్నట్లుగా, రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 2లక్షల 30వేల ఉద్యోగాలు ఇవ్వాల్సిన వ్యక్తి 15వేల ఉద్యోగాలు ఇచ్చి పండుగ చేసుకోండని అన్నారన్నారు. ఈ ప్రభుత్వం చేతగాని తనం వల్ల 7లక్షల మంది యువతీ యువకులు నిరుద్యోగులు అయ్యారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు ఏపీపీఏస్సీ ఒక రాజకీయ వేదకగా మారిందని విమర్శించారు. దక్షిణ భారత దేశంలో అత్యధిక నిరుద్యోగులు ఉన్న ప్రదేశంగా ఏపి ఘనత సాధించిందని లోకేష్ విమర్శించారు.