Nara Lokesh : ఏపీ మాజీ ముఖ్యమంత్రి , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్ గురించి సహజంగా వినిపించే విమర్శ ఏంటో తెలిసిందే.
అయితే, తాజాగా ఆయన దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. తాను ఏంటో నిరూపించుకునే క్రమంలో ఉన్నారట. ట్వీట్లకే పరిమితమైన యువనేత అనే స్టాంప్ నుంచి మాటల్లో కూడా తాను ఏంటో నిరూపించుకునేలా ముందుకు సాగుతున్నారంటున్నారు. దీనికి నిదర్శనం తాజాగా విశాఖ టూరులో లోకేష్ ప్రసంగం.
ఎప్పట్లాగే Nara Lokesh లోకేష్ ఏం చేశారంటే…
బహిరంగ ప్రసంగాల కంటే ట్విట్టర్లోనే ఎక్కువగా స్పందిచే లోకేష్ ఆ వేదికపై మరోసారి సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని లోకేష్ ఆరోపించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా… టీడీపీ హవా పంచాయతీ ఎన్నికల్లో కనిపించిందన్నారు. “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాత జాగీరులా విర్రవీగుతోన్న జగన్రెడ్డి వైసీపీ మద్దతుదారులు 95 శాతం పంచాయతీలలో ఏకగ్రీవంగా గెలవాలని టార్గెట్ పెట్టారు. తొలివిడతలోనే తెలుగుదేశం సైన్యం ఎదురొడ్డి పోరాడి జెండా ఎగరేసింది. టిడిపి అభిమాని నుంచి అధ్యక్షుడి వరకూ పడిన కష్టానికి ప్రతిఫలం ఈ సానుకూల ఫలితాలు.బెదిరించి ఏకగ్రీవాలు చేసుకోవడం, చంపేస్తామని హెచ్చరించి విత్డ్రా చేయించడమూ విజయమేనా జగన్ రెడ్డి! జనం ఇంకా వైకాపా వైపే ఉన్నారని మీకు నమ్మకం వుంటే.. దమ్ముంటే అధికార దుర్వినియోగం చేయకుండా 3,4 విడతల్లో పోటీ చేయండి. ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది.” అంటూ నారా లోకేష్ సవాల్ విసిరారు. అయితే, ఈ ట్వీట్లకు కొనసాగింపుగా విశాఖలో ఆకట్టుకునే ప్రసంగమే చేశారంటున్నారు.
మీడియా ముందు భలే మాట్లాడారే…
స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దీక్షకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 32 మంది రైతులు ఆత్మ త్యాగ ఫలితం విశాఖ ఉక్కుఅని అన్నారు. లాభసాటిగా లేదని ప్రైవేటీకరణ అంటున్నారు ఇది చాలా దారుణం అని ఆయన అన్నారు. YCPకి 28మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు ? అని ప్రశ్నించిన ఆయన లేఖ రాశా అని ముఖ్యమంత్రి అంటున్నారు, దిల్లీలో అడిగితే ఏ లేఖ అక్కడ అందలేదు అని ఆయన అన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి లేఖ రాయ లేని వ్యక్తి ప్రత్యేక హోదా సాధిస్తారా ? అని ఆయన ప్రశ్నించారు. బుల్లెట్ లేని గన్ జగన్ అని పేర్కొన్న ఆయన గన్ నుంచి నీరు వస్తుందని అన్నారు.