Nara Lokesh: రాష్ట్రంలో కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గతంలోనే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పరీక్షలు నిర్వహించడమే మేలని తెలియజేసింది. జూన్ మొదటి వారంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది.
ఈ నేపథ్యంలో నారా లోకేష్ తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. దేశంలో 14 రాష్ట్రాల్లో పరక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారనీ, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ వంటి బోర్డులు కూడా పరీక్షలు చేశాయన్న విషయాన్ని లోకేష్ లేఖలో పేర్కొన్నారు. కరోనా సెకండ్ వేవ్ తో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే పట్టుదలతో ఉందని తెలిపారు. వేలాది పరీక్షా కేంద్రాల్ల 6.7లక్షల మంది పదవ తరగతి పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మరో పక్క 5 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు తమ పరీక్షలపై అనిశ్చితిని ఎదుర్కొంటున్నారన్నారు.
Read More: Vijayasai reddy: చంద్రబాబును గుంటనక్కగా పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి
టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో సీబీఎస్ఈ అవలంబిస్తున్న విధానాన్నే ఏపి ప్రభుత్వం కూడా పాటించేలా చర్యలు తీసుకోవాలని అమిత్ షాను లోకేష్ కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలని లోకేష్ కోరారు.