Murder : గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ ఘటన జరిగింది. డిగ్రీ చదువుతున్న విద్యార్థిని సహచర విద్యార్థి (ప్రియుడే) గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోవిందపురం మేజర్ కాలువలో పడేశాడు. గుంటూరు జిల్లా ముప్పాళల్ మండలం గోళ్లపాలెంకు చెందిన కోట అనూష (19) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలకు చెందిన విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుకుందామని చెప్పి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని రావిపాడు తీసుకువెళ్లి అక్కడ గొంతు నులుమి హత్య చేశాడు. మృతదేహాన్ని కాలువలో పడేసి పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. విషయం తెలిసిన వెంటనే నరసరావుపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Murder : విద్యార్థుల ధర్నా
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థులు, కుటుంబ సభ్యులు మార్చురీ వద్ద నుండి మృతదేహాన్ని తీసుకుని పల్నాడు రోడ్డు కూడలికి చేరుకుని ధర్నా నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చే వరకూ ధర్నా విరమించేది లేదంటూ తేల్చిచెప్పారు. సమాచారం అందుకున్న టీడీపీ, సీపీఐ, పలు ప్రజా సంఘాల నేతలు అక్కడకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. దాదాపు మూడు గంటలకు పైగా ధర్నా నిర్వహించారు. విద్యార్థుల ఆందోళన కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?