YS Jagan: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇలాకాలో ఓ ప్రత్యేకతతో వార్తల్లోకి ఎక్కాయి. దేశంలో కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో మ్యుకర్ మైకోసిస్(బ్లాక్ ఫంగస్) కేసులు సైతం ఆందోళన రేకెత్తిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ ఫంగస్ కేసుల్లో ప్రధాని ఇలాకా అయిన గుజరాత్ మొదటి స్థానంలో ఉండగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసుల సంఖ్య అధికంగా ఉందని తేలింది. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Read More : Lock down : తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపు?
ఇవీ లెక్కలు…
కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటివరకు దేశంలో 11,717 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 2,859 కేసులు గుజరాత్లో ఉండగా, మహారాష్ట్రలో 2,770 మంది, ఆంధ్రప్రదేశ్ లో 768 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు లెక్కలు తెలిపాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల చట్టం (ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్) కింద పరిగణించాలని కేంద్రం కొద్దిరోజుల క్రితం రాష్ట్రాలకు తెలిపింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు దీన్ని అంటువ్యాధిగా ప్రకటించి చికిత్స అందిస్తున్నాయి.
Read More : Black fungus: షాక్ః కరోనా రాకపోయినా… బ్లాక్ ఫంగస్ ముప్పు మనకు ఉంటుందట
ఏపీలో ఏం జరుగుతోంది?
ఏపీ లో బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్య శ్రీ కింద చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి బారిన పడిన వారిని నిశితంగా అధ్యయనం చేస్తూ చికిత్స అందిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ ప్రమాదకరంగా మారింది. బ్లాక్ ఫంగస్ బారిన పడినవారికి అతి తక్కువ రోజుల్లోనే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు చెబుతున్నారు.