Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా దృష్టిని ఆకర్షించడంలో టాప్లో ఉంటారనే టాక్ విశ్లషకులు , ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపించే సంగతి తెలిసిందే. అయితే, ఆయన్ను మించిన రీతిలో ఓ నేత మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నారు. సదరు నేత తెలుగు వ్యక్తి కావడం విశేషం. ఆయన ఎవరో కాదు…. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.
నారాయణ…. నారాయణ …
కరుడుగట్టిన కమ్యూనిస్టుగా చెప్పుకొనే నారాయణ వివిధ అంశాలకు మినహాయింపుగా చెప్పవచ్చు. గతంలో జరిగిన ఘటనలే దీనికి ఉదాహరణ. గాంధీ జయంతి రోజు చికెన్ తిని.. ఏడాది పాటు చికెన్ తినడం మానేయడం ఆయన సొంతం. తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు. కమ్యూనిస్టు అయి ఉండి ఇలా చేయడం ఏంటని అని ప్రశ్నిస్తే.. చాలాసార్లు తిరుమలకు వచ్చా.. కానీ, శ్రీవారిని దర్శించుకోలేదు.. కానీ, కుటుంబసభ్యులు బలవంతం చేయడంతో ఈసారి తప్పలేదని సమాధానం ఇచ్చారు. తాజాగా విశాఖలోని శారదా పీఠంలో ప్రత్యక్షమయిన నారాయణ అక్కడ స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు!
ఓటు వేయండి.. ఆశీర్వదించండి….
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటంతో విశాఖ జీవీఎంసీ బరిలో ఉన్న సీపీఐ అభ్యర్థి తరపున నారాయణ ప్రచారం చేశారు. 97వ వార్డు అభ్యర్తి యశోద తరపున చిన మూషిడివాడలో ప్రచారం చేసిన ఆయన.. అక్కడే ఉన్న విశాఖ శారదా పీఠాన్ని కూడా సందర్శించారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించిన నారాయణ.. పనిలో పనిగా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. కాగా, శారదా పీఠంలో నారాయణ ప్రత్యక్షం కావడంలో పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికరంగా మారింది. మీడియా దృష్టిని ఆకర్షించడంలో నారాయణ అందె వేసిన చేయి అని పలువురు కామెంట్ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?