Ayyanna patrudu: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి మున్సిపల్ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అయ్యన్నపాత్రుడు గత కొంత కాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ మున్సిపల్ అధికారులు ఆదివారం వేకువజామున అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను జేసీబీతో కూల్చివేశారు. ప్రభుత్వానికి చెందిన రెండు సెంట్ల భూమిని అక్రమించి అయ్యన్న గోడ కట్టారని వాటిని తొలగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు మున్సిపల్ అధికారులు. ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా గోడను కూల్చివేయడం ఏమిటంటూ అయ్యన్న కుటుంబ సభ్యులు.. పోలీసులు, మున్సిపల్ సిబ్బందితో వాదనకు దిగారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే టీడీపీ శ్రేణులు అయ్యన్న ఇంటి వైపునకు రాకుండా ఉన్న రెండు మార్గాలను మూసివేశారు. నర్సీపట్నం ఎఎస్పీ పర్యవేక్షణలో పోలీసు బలగాలను మోహరించారు. అయ్యన్న పాత్రుడు ఇంటికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు రావడంతో ఆయనను అరెస్టు చేస్తారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. అయితే తాము ఎవరినీ అరెస్టు చేయడానికి రాలేదని అనకాపల్లి డీఎస్పీ విజయ భాస్కర్ తెలిపారు. ఆక్రమణ తొలగింపు సందర్భంగా మున్సిపల్ అధికారుల విజ్ఞప్తి మేరకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అయితే ఈ నెల 2వ తేదీతో ఉన్న నోటీసులు ఇప్పుడు ఇచ్చి వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్న పాత్రుడు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్పందించి జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
నర్సీపట్నం పులి ని చూసి పులివెందుల పిల్లి భయపడింది. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుంది.(1/3) pic.twitter.com/u7KIS1pmq4
— Lokesh Nara (@naralokesh) June 19, 2022