Lock down: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వలే తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కట్టడికి కర్ఫ్యూ , లాక్ డౌన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో ఈనెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. దీన్ని కొనసాగించడంపై త్వరలోనే నిర్ణయం వెలువడనుంది. అయితే, ఈ సమయంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలో కీలక నిర్ణయం వెలువడేందుకు రంగం సిద్ధమైంది. జూన్ 7 తర్వాత లాక్డౌన్ ను సడలించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. త్వరలో ఈ మేరకు ఆదేశాలు వెలువడనున్నాయి.
Read More: Harish Rao: హరీశ్ రావు ఆరోగ్య మంత్రి అయిపోయినట్లేనా?
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో..
కరోనా సెకండ్ వేవ్ జూన్ నెల చివరి నాటికి తగ్గుముఖం పట్టొచ్చని అంచనా వేశారు. వచ్చే నెల చివరి నాటికి కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టవచ్చని భావించినప్పటికీ ఆ గడువు కంటే ముందే పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నందున లాక్ డౌన్ సడలింపుపై ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ అన్లాక్ చేసే దిశగా తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులు, నిపుణులను కోరారు. సీఎం ఆదేశాల ప్రకారం అన్లాక్ ప్రక్రియ 3-4 దశల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.
Read More: KCR: కేసీఆర్ కీలక నిర్ణయం… తెలంగాణ వాళ్లకు గుడ్ న్యూస్
వైద్యులు ఏమంటున్నారు?
వైరస్ వ్యాప్తి అదుపులో ఉండేందుకు ప్రజలు లాక్డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండటం ఒక్కటే మార్గమని అన్నారు. బెంగళూరు నగరంలో కరోనా కేసుల రికవరీల సంఖ్య పెరిగింది. ఇదే సమయంలో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ లాక్ డౌన్ దిశగా సర్కారు కదులుతోంది. బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ చీఫ్ కమిషనర్ గౌరవ్గుప్తా లాక్ డౌన్ సడలింపు వార్తలపై స్పందిస్తూ కరోనాపై పోరాడటానికి ప్రజలు బిబిఎంపితో చేతులు కలపాలని అన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉంటే ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం అవడం, కొత్త కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని ఆయన విశ్లేషించారు.