NGT: విశాఖలోని రుషికొండ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ తవ్వకాలను నిలుపుదల చేయాలని ఎన్జీటీ ఆదేశించింది. రుషికొండలో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ పిటిషన్ పై ఈ నెల 6వ తేదీ విచారణ జరిపింది. ఇప్పటి వరకూ జరిగిన తవ్వకాలపై అధ్యయనానికి సంయుక్త కమిటీని నియమించింది. ఏపి కోస్టల్ మేనేజ్మెంట్ అథారిటీ నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుందని తెలిపిన ఎన్జీటీ..నెల రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
NGT: రుషి కొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు అంటూ..
రుషికొండ వద్ద ఏపి పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. దీనిపై ఎన్జీటీ గత ఏడాదే స్పందించింది. అక్కడ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటునకూ ఆదేశించింది. అయితే రుషి కొండ వద్ద నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారనీ, పర్యావరణానికి హానికలుగుతోందని ఎంపి రఘురామ కృష్ణంరాజు ఎన్జీటీలో ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన ఎన్జీటీ..తవ్వకాలపై స్టే ఇచ్చింది.
రుషికొండపై అంతకు ముందు హరిత రిసార్ట్స్ ఉండేది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూల్చివేశారు. ఏపి పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కొత్త ప్రాజెక్టు నిర్మాణాల కోసం రుషికొండను తవ్వడం ప్రారంభించారు. ఎండాట సర్వే నంబర్ 19లో 9.88 ఎకరాల్లో కొండపై తవ్వకాలకు గనుల శాఖ అనుమతి ఇచ్చింది. అయితే అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సిఆర్ జడ్ నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరపకూడదని తెలిసినా పర్యాటక శాఖ పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఏపి హైకోర్టు లో ఓ పిటిషన్ దాఖలు చేయగా అది విచారణలో ఉంది.