Nimmagadda : ఏపి AP లో పంచాయతీ ఎన్నికల Local body elections సమరం రసవత్తరంగా కొనసాగుతోంది. ఒక పక్క అధికార విపక్షాల మద్య మాటల తూటాలు పేలుతుండగా మరో పక్క ప్రభుత్వం, ఎస్ఈసీకి మద్య వైరం కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని Govt ఇబ్బంది పెట్టాలని ఎస్ఈసీ SEC, ఎస్ఈసీని ఇరుకున పెట్టాలని ప్రభుత్వం ఎత్తులు పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఇప్పటి వరకూ చూశాం. ప్రభుత్వంపై ఎస్ఈసీ, ఎస్ఈసీపై ప్రభుత్వం కోర్టులకు వెళ్లడం సాధారణ అంశంగా మారిపోయింది. అయితే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం TDP పార్టీకి, చంద్రబాబు Chandra babu కు అనుకూలమని ఆయన చెప్పినట్లు ఆడుతున్నాడు అంటూ వైసీపీ YCP నేతలు విమర్శలు చేస్తుండగా నిమ్మగడ్డ మాత్రం టీడీపీ ఏమీ సపోర్టుగా లేరనీ, వైసీపీకే సపోర్టుగానే ఉంటున్నారనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. వారి వాదనలు బలం చేకూర్చేలా ఉదాహారణలు చూపుతున్నారు.
వేగంగా అచ్చెన్నాయుడు అరెస్టు
సాధారణంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా పోలీస్ వ్యవస్థతో అన్ని శాఖలు ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటిస్తుంటాయి. ఎన్నికలకు సంబంధించిన ఘర్షణలు, కేసుల నమోదు, అరెస్టుల విషయం ఎన్నికల సంఘానికి తెలియజేస్తుంటాయి. అయితే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిన తరువాత తొలి అరెస్టు శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. అది కూడా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడుని పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో నిమ్మాడలోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడుపై నమోదు అయిన కేసు ఎన్నికలకు సంబంధించినదే. నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ వైసీపీ మద్దతు దారుడిని బెదిరించారన్న ఆరోపణతో అచ్చెన్నాయుడుతో సహా 22 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన తరువాత ఆ పార్టీ నాయకులు సదరు అభ్యర్థితో అచ్చెన్నాయుడు ఫోన్ లో మాట్లాడిన సంభాషణ వీడియోను మీడియాకు విడుదల చేశారు. అయితే ఆయన మాట్లాడిన దానిలో బంధువర్గంలోని వ్యక్తితో మాట్లాడినట్లుగానే ఉంది గానీ ఎక్కడా బెదిరించినట్లుగా లేదు. కానీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టుకు హజరుపర్చారు. మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
వైసీపీ నేతలపై చర్యలు ఏవి ?
అయితే ఈ కేసు విషయంలో వేగంగా స్పందించి అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగం వైసీపీ ఎమ్మెల్యేలు అభ్యర్థులకు ఫోన్ చేసి బెదిరించినట్లుగా నమోదు అయిన కేసులపై ఈ స్పీడ్ చూపించలేదు అంటున్నారు. ఓ వైసీపీ ఎమ్మెల్యే ఒక వార్డు అభ్యర్థి అల్లుడికి ఫోన్ చేసి నామినేషన్ ఉపసంహరించుకోకపోతే ఇబ్బందులు పడతారు అంటూ హెచ్చరికలు జారీ చేయడం, ఆ ఫోన్ కాల్ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా పోలీసులు అంత వేగంగా స్పందించిన దాఖలాలు లేవు. ఇవి గమనిస్తున్న వారు మాత్రం నిమ్మగడ్డ ఒక ప్రక్క ప్రభుత్వంతో గొడవ పడుతున్నా మరో పక్క సైలెంట్ గా అధికార పార్టీకి సహకరిస్తున్నారనీ అంటున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ పై ప్రజల్లో ఏర్పడిన పచ్చ ముద్రను తొలగించుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా లేక నిజంగానే అధికార పార్టీకి సైలెంట్ గా సహకరిస్తున్నారా అనేది కొద్ది రోజుల్లో వెల్లడి అవుతుందని అంటున్నారు పరిశీలకులు.