Nimmagadda ramesh : గత కొద్దికాలంగా ఏపీలో వార్తల్లో ప్రధాన వ్యక్తిగా నిలుస్తున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన నిమ్మగడ్డ మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
అయితే, ఈ ఎన్నికలపై రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే అడుగు ముందుకు వేయాలని డిసైడయ్యారు. ఎన్నికలకు హైకోర్టు కూడా గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మార్చి 1న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
Nimmagadda ramesh అసలేం జరిగింది ?
ఏపీలోని 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 140 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రీ-నోటిఫికేషన్ జారీ చేయగా.. వివిధ కారణాలతో నాలుగు నగరపాలక సంస్థలు, 29 పురపాలికలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇక, గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభం కానుంది.. దీని ప్రకారం నామినేషన్ల ఉపసంహరణ మార్చి 2 నుంచి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఉండగా.. ఆ తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు.. 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.. 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అయితే, ఈ ప్రక్రియపై పలు పార్టీలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
అందరి మాట ప్రకారమే…
అఖిలపక్ష సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆహ్వానం పంపింది. మార్చి 1న ఉదయం 9.30 గంటలకు ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్కరు రావాలని రాష్ట్ర ఎన్నికలు సంఘం ఆ ఆహ్వానాల్లో పేర్కొంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు, ప్రవర్తనా నియమావళిని పాటించాలని రాజకీయపక్షాలను కోరేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ సమావేశానికి హాజరుకానున్న రాజకీయపక్షాల నుంచి ఎన్నికల నిర్వహణలో సూచనలు, సలహాలు కూడా స్వీకరించనుంది. మొత్తంగా ఈ ప్రక్రియతో నిమ్మగడ్డ అందరివాడుగా మారుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?