Nimmagadda Ramesh Kumar : తెగింపు – ధైర్యం అంటే ఇదే : జగన్ మోహన్ రెడ్డి CM కుర్చీ కే ఎసరు పెట్టిన నిమ్మగడ్డ ??
Nimmagadda Ramesh Kumar : ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కడప జిల్లా పర్యటన చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే తనకు ఎనలేని గౌరవం అంటూ చెప్పుకొచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఆయన వల్లే ఈ స్థాయి లో వచ్చినట్లు ఇటీవల కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏకగ్రీవాలు బలవంతంగా చేస్తే ఎవరిని ఊరుకునేది లేదని భయపడే ప్రసక్తి లేదని నిన్న మార్నింగ్ ఇచ్చేటట్టు మాట్లాడిన నిమ్మగడ్డ తాజాగా తెగింపు ధైర్యం తో జగన్ ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చే రీతిలో తాజాగా వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Nimmagadda Ramesh Kumar : సీబీఐ కేసుల ప్రస్తావన
విషయంలోకి వెళ్తే అప్పట్లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐఏఎస్ పదవిలో వ్యవహరించిన వాళ్లు చాలామంది సి.బి.ఐ కేసుల్లో ఇరుక్కున్నారు అని, కానీ వైఎస్ తనకు ఇచ్చిన స్వతంత్రత వల్ల తాను ఈ స్థాయిలోకి వచ్చినట్లు కామెంట్ చేశారు. తాను స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయాల వల్ల తర్వాత కాలంలో ఎంతో మంది అధికారులు సీబీఐ కేసులో విచారణ ఎదుర్కొన్న తాను మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అప్పట్లో కోర్టుల్లో కొన్ని సాక్ష్యాలు కూడా చెప్పడం జరిగింది, ఇకముందు కూడా చెబుతాను అన్నట్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక కామెంట్లు చేయడం జరిగింది.
దీంతో రమేష్ కుమార్ కావాలని జగన్ కుర్చీకి ఎసరు పెట్టే రీతిలో వ్యాఖ్యలు చేయడం జరిగిందని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంమీద చూసుకుంటే జగన్ కేసుల విషయంలో తలచుకుంటే ఏదైనా చేయటం గ్యారంటీ అన్నట్టు నిమ్మగడ్డ వ్యాఖ్యలు ఉన్నాయని కొంతమంది సీనియర్లు అంటున్నారు. ఇంతలా నిమ్మగడ్డ రియాక్ట్ అవడానికి గల కారణం ఆయనకు వ్యక్తిగతంగా బెదిరింపు కాల్స్ వైసీపీ నుండి వస్తున్నాయని, అందువల్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు టాక్.