Nimmagadda Ramesh Kumar : వైయస్ రాజశేఖర్ రెడ్డి పై కీలక కామెంట్లు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ !!
Nimmagadda Ramesh Kumar : ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్షణక్షణానికి ఏపీలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నరు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో ఉంటున్నాయి అనే టాక్ మీడియా సర్కిల్స్ లో బలంగా వినబడుతోంది. ఇదే క్రమంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటం తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నీ టచ్ చేయలేని స్థితిలో ఉంది ప్రభుత్వం. పరిస్థితి ఇలా ఉండగా గతంలో వాయిదాపడిన ఎన్నికల్లో అప్పట్లో…రాయలసీమ ప్రాంతంలో ఏకగ్రీవమైన చోట్ల తాజాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఏ ప్రాంతాల్లో అయితే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయో వాటిని సెన్సిటివ్ ప్రాంతాలుగా నిమ్మగడ్డ తాజాగా గుర్తించడం అధికారులకు ఒక్కసారిగా షాక్ ఇచ్చినట్లు అయింది. ఒకానొక సమయంలో ఫ్యాక్షన్ ముద్ర కలిగిన రాయలసీమలో ఇప్పుడు అటువంటి ఛాయలు కూడా లేని ప్రాంతాలను ఆ రీతిలో నిమ్మగడ్డ గుర్తించడం… అది కూడా వైసిపి పార్టీకి గతసారి ఏకగ్రీవమైన ప్రాంతాలను గుర్తించడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తాజాగా ఒంటిమిట్ట కోదండ రాముని దర్శించుకోవడం జరిగింది.
ఇదే సమయంలో కలెక్టరేట్లో అధికారులతో భేటీ అయిన ఆయన పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా జరగాలని అసాధారణ ఏకగ్రీవ ప్రక్రియ సరి కాదని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రక్రియ పై షాడో బృందాలు దృష్టి పెడతాయి అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పని చేసినట్లు ఆయన దృక్పథం ఉండేదని కీలక కామెంట్లు చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితులు బట్టి తాను భయపడే ప్రసక్తి లేదని … ఎట్టి పరిస్థితుల్లో సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించడమే రాజ్యాంగం తనకిచ్చిన హక్కు అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునరుద్ఘాటించారు.