ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో అధికార ప్రతిపక్షాల మద్య పెద్ద యుద్దమే జరుగుతోంది. అదే సమయంలో రాజకీయ పార్టీల ఎత్తులు పై ఎత్తుల కంటే ఏపీ ఎన్నికల కమిషనర్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం హాట్ హాట్ గా ఉందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో ఏపీ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విషయంలో నిమ్మగడ్డ దూకుడును టిడిపి స్వాగతించగా….ప్రభుత్వం, ఉద్యోగులు, అదికారులు అడ్డు చెప్పారు. దీంతో కోర్టు షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది.
అప్పుడే సంతోషం … ఆ వెంటనే….
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించాలని ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో …. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడాన్ని టిడిపి స్వాగతించింది. కరోనా ఎలా అడ్డు వస్తుందంటూ నిమ్మగడ్డ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం భయపడుతుందంటూ సవాళ్లు విసిరింది. అయితే ఏకపక్షంగా నోటిఫికేషన్ ఇచ్చారంటూ ఉద్యోగులు కోర్టుకు వెళ్లగా….దాన్ని ఆమోందించిన కోర్టు మొత్తం నోటిఫికేషన్ ను రద్దు చేసింది.
ఎస్ఈసీ దూకుడు
మరోవైపు హైకోర్ట్ సింగిల్ జడ్జ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను డివిజనల్ బెంచ్ లో ఎన్నికల కమిషన్ సవాల్ చేసింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు సెటిల్డ్ లాకు విరుద్ధమన్న ఏపీ ఎస్ఈసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండకూడదని తీర్పులున్నాయి, అందుకు విరుద్ధంగా నేడు తీర్పు వచ్చిందని పేర్కొంది. సుప్రీంకోర్ట్ ఇచ్చిన అనేక తీర్పుల్లోనూ ఇదే అంశాన్ని స్పష్టంగా పేర్కొందని ఏపీ ఎలక్షన్ కమిషన్ వాదిస్తోంది. చట్టబద్ద వ్యవస్థ కాబట్టి ఎస్ఈసీకి అనుకూలంగా న్యాయస్థానం తీర్పు ఇస్తుందా? పాత తీర్పుల ఆధారంగా నిమ్మగడ్డ రమేశ్ ఏపీ సర్కారుకు షాక్ ఇచ్చే గేమ్ ప్లాన్ మొదలు పెట్టారా? అనే చర్చ జరుగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?