Nimmagadda Ramesh Kumar : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ఈ పంచాయతీ ఎన్నికల వేడి మరింత రాజేస్తుంది. ముఖ్యంగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలు అధికార పార్టీ కి చెమటలు పట్టేస్తున్నాయి. ఎక్కడా కూడా ఏకగ్రీవం అవకుండా.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటూ..
కీలకంగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల విషయంలో ఏ ఎన్నికల కమిషనర్ తీసుకొన్ననిర్ణయం తాజాగా నిమ్మగడ్డ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల పరిధిలో నోటా అనే ఆప్షన్ ఉండేది ఇప్పుడు దాన్ని పంచాయతీ ఎన్నికల పరిధిలోకి కూడా తీసుకురావాలని నిమ్మగడ్డ రమేష్ డిసైడ్ అయినట్లు వార్తలు వినబడుతున్నాయి. పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పేపర్ లో కూడా నోటా అందుబాటులోకి తీసుకురావాలని నిమ్మగడ్డ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల గుర్తులు కాకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తించే గుర్తులు మాత్రమే బ్యాలెట్ పేపర్ లో ఉండటం ఇప్పటిదాకా చూస్తే త్వరలో ఏపీ లో జరగబోయే పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్ లో నోటా గుర్తు కూడా ఉండబోతున్నట్లు సరికొత్త టాక్ వస్తోంది. దీంతో పోటీలో ఉన్న ఏ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే నోటా కు వేసే రీతిలో ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.