Nimmagadda Ramesh : ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ మరోమారు తన మార్కు ను చాటుకున్నారు. ఏపీ సీఎస్ ఆదిత్యనాద్ దాస్ కు ఎస్ఈసీ మరో లేఖ రాశారు.
ఈ దఫా మరింత ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సహకరించడం లేదని లేఖలో మరోమారు కమిషనర్ నిమ్మగడ్డ పేర్కొన్నారు. కలెక్టర్ల నియామకానికి తిరస్కరించిన ప్రతిపాదనలనే మళ్లీ పంపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఏపీ సీఎస్ ఏ విధంగా స్పందించనున్నారనే ఆసక్తి మొదలైంది.
Nimmagadda ramesh నిమ్మగడ్డ ఎక్కడ నొచ్చుకున్నారంటే…
గుంటూరు కలెక్టర్ గా బసంత్ కుమార్, చిత్తూరు కలెక్టర్ హరినారాయణ్ లను కమిషన్ సూచించింది. అయితే, ఆ మేరకు నిర్ణయం వెలువడకపోవడంతో నిమ్మగడ్డ నొచ్చుకుంటూ లేఖ రాశారు.నికల సమయంలో కలెక్టర్ నియామకం చాలా కీలకమన్న ఆయన జీఏడీ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ వలన అది నిలిచిపోయిందని అన్నారు. ఇప్పటికే రెండు సార్లు ప్రవీణ్ ప్రకాష్ ని విధుల నుండి తప్పించాలని ఆదేశించాను అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. కోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో కీలకమైన పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకారం అవసరం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో సమస్యను పరిష్కరించే ధోరణి కనిపించడం లేదని అయన అన్నారు.
పోలీసులు ఓకే… అధికారులే నాట్ ఓకే
ఏడుగురు పోలీసు అధికారుల మార్పు విషయంలో డీజీపీ పూర్తిగా సహకరిస్తున్నారని ఎస్ఈసీ నిమ్మగడ్డ పేర్కొన్నారు. డీజీపీ, పోలీస్ అధికారుల సహకారం పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కలిగిన పంచాయతీ రాజ్ శాఖ అధికారులు గోపాల క్రిష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లు కమిషన్ ఆఫీస్ కి రావడం లేదు అని ఆయన లేఖలో పేర్కొన్నారు. 27న వీడియో కాన్ఫరెన్సు నాడే చివరిగా వాళ్లు కమిషన్ కార్యాయానికి వచ్చారని పేర్కొన్నారు. కోర్టు ముందు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం మినహా మరో మార్గం లేదని నిమ్మగడ్డ హెచ్చరించారు.