Nimmagadda ramesh : నిమ్మగడ్డ రమేష్ కుమార్ … ఏపీ ఎస్ఈసీ. గత కొద్దికాలంగా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ ఉన్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఆయన పేరు మారుమోగిపోతోంది.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పంచాయతీ ఎన్నికలపై వెనక్కి తగ్గకుండా పట్టుబట్టి నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలకు పూర్తి కాగా.. నాల్గో విడత పంచాయతీ పోల్ కూడా త్వరలోనే పూర్తి కానుంది. ఇక, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలకు కూడా రాబోతున్నాయి. ఈ ఉత్కంఠలోనే రాజకీయ పార్టీలు ఉంటే ఇంకో సంచలన వార్తను నిమ్మగడ్డ తెరమీదకు తెచ్చారు. అదే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు..!
Nimmagadda ramesh ఇప్పటికే ఓ రేంజ్లో…
గతంలో ఆగిన చోటు నుంచే మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పలు పార్టీలకు మింగుడు పడని తరుణంలో… స్థానిక సంస్థలైన ZPTC, MPTC ఎన్నికలపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రలోభాలు, బెదిరింపుల కారణంగా నామినేషన్లు వేయనివారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ వద్ద ఉన్న ఆధారాలతో జిల్లా కలెక్టర్లను కలిస్తే మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశ మిస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 20వ తేదీలోపు ఇటువంటి నామినేషన్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఎస్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.
ప్రభుత్వం ఏం చేయనుంది?
ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎస్ఈసీ సమాలోచనలు చేస్తున్నారు. తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలపై ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. ఆగిన చోట నుంచే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడం… కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం…. ఈ ఎన్నికల నిర్వహణను కొత్త ఎస్ఈసీకి వదిలేయడం. ఈ మూడు ఆప్షన్లను ఎస్ఈసీ పరిశీలిస్తున్నారు. అయితే, తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి తగిలిన షాక్ ల నేపథ్యంలో మళ్లీ ఈ షెడ్యూల్ సైతం అధికార పార్టీ దెబ్బ కు నిమ్మగడ్డ నిర్ణయం ద్వారా చంద్రబాబుకు ఎఫెక్ట్ పడేలా మారనుందా? అనే టాక్ వినిపిస్తోంది.